ఇదే బ్రేకింగ్ న్యూస్.. విజయసాయిరెడ్డి ట్వీట్

by  |
ఇదే బ్రేకింగ్ న్యూస్.. విజయసాయిరెడ్డి ట్వీట్
X

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను టీడీపీ ఎంపీలు కలిసి ఏపీ ప్రభుత్వంపై ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంపై ఎంపీ విజయసాయిరెడ్డి తనదైన శైలిలో స్పందించారు. “బ్రేకింగ్ న్యూస్… చంద్రబాబు, లోకేశ్, మాజీ మంత్రుల అవినీతిపై ఎలాంటి విచారణ జరపవద్దని రాష్ట్రపతిని కోరిన టీడీపీ ఎంపీలు” అంటూ వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. “గత ప్రభుత్వ అవినీతిపై సమగ్ర విచారణ పూర్తయితే అందరు జైలుకు పోవాల్సి వస్తుందని టీడీపీ నేతల ఆందోళన” అంటూ మరో కామెంట్ చేశారు. కాగా, రాష్ట్రపతిని కలిసివారిలో ఎంపీలు కేశినేని నాని, గల్లా జయదేవ్, రామ్మోహన్ నాయుడు, కనకమేడల ఉన్నారు. ఏపీలో అరాచక పాలన సాగుతోందంటూ వారు రాష్ట్రపతికి ఫిర్యాదు చేశారు.

Next Story

Most Viewed