టీడీపీ ఎంపీ రామ్మోహన్‌నాయుడు ఫ్లెక్సీకి క్షీరాభిషేకం

by  |
rammohan naidu
X

దిశ, వెబ్ డెస్క్: స్టీల్ ఫ్లాంట్ ఉద్యమానికి మద్దతు తెలిపిన టీడీపీ ఎంపీ రామ్మోహన్‌నాయుడు ఫ్లెక్సీకి కార్మికులు పాలాభిషేకం చేశారు. లోక్‌సభలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆయన కేంద్రంపై విరుచుకుపడ్డారు. విశాఖ ఉక్కు ప్రైవేట్‌పరం కాకుండా అడ్డుకుంటామని చెప్పుకొచ్చారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఉక్కు కార్మిక నేతలు ఎంపీ రామ్మోహన్ నాయుడు ఫ్లెక్సీకి క్షీరాభిషేకం నిర్వహించారు. మరోవైపు ప్రధాని నరేంద్రమోడీ దిష్టిబొమ్మకు శవయాత్ర చేసి, దగ్ధం చేశారు. మోదీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. కేంద్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమితి స్టీల్ ఫ్లాంట్ ఎదుట ఆందోళనకు దిగింది. విశాఖ ఉక్కు మా హక్కు అంటూ కార్మికులు నినాదాలు చేశారు.



Next Story

Most Viewed