మంత్రి, ఎమ్మెల్యేలు ఒకరోజు అక్కడ ఉంటే తెలుస్తుంది: టీడీపీ బోండా ఉమ

by  |
మంత్రి, ఎమ్మెల్యేలు ఒకరోజు అక్కడ ఉంటే తెలుస్తుంది: టీడీపీ బోండా ఉమ
X

దిశ, ఏపీ బ్యూరో : జనావాసాల్లో చెత్త నిల్వలపై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ హయాంలో డంపింగ్ యార్డులోని 2.5 లక్షల టన్నుల చెత్తను శాస్త్రీయ పద్ధతిలో తొలగించినట్లు ఆయన చెప్పుకొచ్చారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక మళ్లీ చెత్త సమస్య ఉత్పన్నమైందని ధ్వజమెత్తారు.

మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ఎమ్మెల్యే మల్లాది విష్ణుకు ప్రజల కష్టాలపై పట్టింపు లేదని విమర్శించారు. మంత్రి, ఎమ్మెల్యేలు ఒకరోజు సింఘీనగర్‌లో ఉంటే ప్రజల బాధలు తెలుస్తాయని మండిపడ్డారు. చెత్త డంపింగ్ నిలిపివేసి.. ట్రాన్స్‌ఫార్మర్ స్టేషన్‌ను తరలించాలని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమ డిమాండ్ చేశారు.

Next Story

Most Viewed