చంద్రబాబుకు మోకాళ్లపై కూర్చుని తెలుగు తమ్ముళ్ల వీడ్కోలు

by  |
Chandrababu
X

దిశ, ఏపీ బ్యూరో: మళ్లీ సీఎం అయ్యాకే అసెంబ్లీలో అడుగుపెడతానంటూ శపథం చేసిన తర్వాత మాజీ సీఎం చంద్రబాబు హైదరాబాద్ వెళ్లారు. అందుకోసం ఉండవల్లి నుండి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న చంద్రబాబును టీడీపీ నేతలు వినూత్నంగా వీడ్కోలు పలికారు. గన్నవరం విమానాశ్రయంలో టీడీపీ కార్యకర్తలు మోకాళ్ల మీద కూర్చుని వీడ్కోలు పలికారు. ప్రభుత్వంపై పోరాటానికి మీరు సిద్ధం అంటే మేమంతా మీ వెంటే అంటూ నినాదాలు చేస్తూ చంద్రబాబుకు మద్దతు పలికారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు, బాబు రాజేంద్ర ప్రసాద్ సహా టీడీపీ నేతలు పాల్గొన్నారు.

చంద్రబాబు భావోద్వేగంపై RGV స్పందన

Next Story

Most Viewed