- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన బీటెక్ విద్యార్థిని రమ్య హత్య ఘటనపై వాస్తవాలు తెలుసుకునేందుకు జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుల బృందం ఏపీలో పర్యటించింది. మంగళవారం ఉదయం విజయవాడ విమానాశ్రయానికి చేరుకున్న ఎస్సీ కమిషన్ సభ్యులకు అధికారులు స్వాగతం పలికారు. అనంతరం విజయవాడ చేరుకున్న జాతీయ ఎస్సీ కమిషన్ బృందాన్ని తెలుగుదేశం పార్టీ నేతలు కలిశారు.
రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న దాడులపై ఫిర్యాదు చేశారు. అయితే వివరాలు విన్న జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు పూర్తిగా వింటామని సాయంత్రం 5.30 గంటలకు తమను కలవాలని అపాయింట్మెంట్ ఇచ్చారు. దీంతో సాయంత్రం ఎస్సీ కమిషన్ సభ్యులను కలవనున్నట్లు మాజీమంత్రి నక్కా ఆనంద్బాబు, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్యలు అన్నారు. జాతీయ ఎస్సీ కమిషన్ బృందాన్ని కలిసిన వారిలో వర్ల రామయ్య, నక్క ఆనంద్బాబు, తెనాలి శ్రావణ్ కుమార్, తంగిరాల సౌమ్య తదితరులు ఉన్నారు.