పోలింగ్ కేంద్రంలో ఉద్రిక్తత.. ఎంపీ, మాజీ ఎమ్మెల్యే మధ్య వాగ్వాదం

by  |
పోలింగ్ కేంద్రంలో ఉద్రిక్తత.. ఎంపీ, మాజీ ఎమ్మెల్యే మధ్య వాగ్వాదం
X

దిశ, ఏపీ బ్యూరో: అనంతపురం జిల్లా పెనుకొండలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. నగర పంచాయతీ ఎన్నికల సందర్భగా పోలింగ్‌ కేంద్రంలోకి వెళ్లేందుకు హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్‌ ప్రయత్నించారు. ఎంపీ మాధవ్‌ వెళ్లడాన్ని మాజీ ఎమ్మెల్యే పార్థసారథి వ్యతిరేకించారు. దీంతో ఇరువురి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఇరువురుని అక్కడ నుంచి పంపించేశారు. అయితే ఎంపీ మాధవ్, మాజీ ఎమ్మెల్యే పార్థసారథిలు సెటైర్లు వేసుకున్నారు. డబ్బులు పంచారని మాధవ్ ఆరోపించగా నిన్న రాత్రి చీరలు, డబ్బులు ఎవరు పంచారో ప్రజలంతా చూశారంటూ మాజీ ఎమ్మెల్యే పార్థసారథి కౌంటర్ ఇచ్చారు. అయితే ఇరు పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు అక్కడికి చేరుకోవడంతో పోలీసులు ఇరువురికి సర్ధి చెప్పి పంపించారు.

Next Story

Most Viewed