- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, ఏపీ బ్యూరో: చిత్తూరులో తెలుగుదేశం పార్టీకి గట్టి షాక్ తగిలింది. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి మహదేవ సందీప్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను అసభ్య పదజాలంతో దూషిస్తూ ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీనిపై వైసీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సందీప్పై చిత్తూరు వన్టౌన్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు సందీప్ కోసం గాలించారు. అయితే శనివారం బెంగళూరులో సందీప్ ఉన్నారన్న విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు వెళ్లి అతడిని అదుపులోకి తీసుకున్నారు. అయితే ఎలాంటి నోటీస్ లేకుండా అరెస్టు చేశారని సందీప్ కుటుంబ సభ్యులు ఆరోపించారు.
- Tags
- ap news
Next Story