ఒక మండలానికి కూడా సరిపోవు : లోకేష్

by  |
ఒక మండలానికి కూడా సరిపోవు : లోకేష్
X

దిశ, వెబ్‌డెస్క్: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ శుక్రవారం వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించారు. అనంతరం ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… రైతుల వద్దకు రాకుండా, సమస్యలు, జరిగిన నష్టం చూడకుండా అధికారులు పంటనష్టం ఎలా వేస్తారని ప్రశ్నించారు. ప్రభుత్వం ఇచ్చిన రూ. 39 కోట్లు ఒక మండలానికి కూడా సరిపోవని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పది లక్షల ఎకరాల్లో వేరుసెనగ పంట దెబ్బతిన్నదని తెలిపారు. అధికారులు వెంటనే క్షేత్రస్థాయిలో పర్యటించి, పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని లోకేష్ డిమాండ్ చేశారు.

Next Story