వెంటనే కేసీఆర్‌కు ఫోన్ చేసి అనుమతులు తెప్పించండి

by  |
వెంటనే కేసీఆర్‌కు ఫోన్ చేసి అనుమతులు తెప్పించండి
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కరోనా పేషెంట్ల అంబులెన్సులను తెలంగాణ పోలీసులు సరిహద్దుల వద్ద నిలిపివేస్తున్న విషయం తెలిసిందే. దీనిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ స్పందించారు. ఏపీలో సరైన వైద్యం దొరికితే ప్రజలు తెలంగాణకు ఎందుకు వెళ్తారని మండిపడ్డారు. ‘‘ఇక్కడుంటే ప్రాణాలు నిలవవు.. పక్క రాష్ట్రానికి వెళ్లే అవకాశం లేదు’’ అని ఆవేదన వ్యక్తం చేశారు. అధికార వైసీపీ పార్టీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయితే.. ఆగమేఘాల మీద హైదరాబాద్ వెళ్లి ఆస్పత్రుల్లో చేరతారు.. ప్రజలకు మాత్రం హైదరాబాద్ వెళ్లే అవకాశం ఇప్పించలేరా? అని ప్రశ్నించారు. వెంటనే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఫోన్ చేసి అనుమతులు తెప్పించండి అని సూచించారు. రాష్ట్ర ప్రజల ఆరోగ్యంపై ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి లేదని విమర్శించారు.


Next Story

Most Viewed