అనుమతి ఇవ్వకుంటే దీక్షకు సిద్ధం

by  |
jc diwakar reddy
X

దిశ, వెబ్‎డెస్క్ : ఏపీ ప్రభుత్వంపై టీడీపీ నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి విరుచుకుపడ్డారు. తమ గనులకు అనుమతి ఇవ్వకపోతే నిరాహార దీక్ష చేస్తానంటూ.. తాడిపత్రి గనులు భూగర్భ శాఖ కార్యాలయం వద్ద ఆందోళనకు సిద్ధమయ్యారు జేసీ దివాకర్ రెడ్డి. రాష్ట్రంలో నియంత పాలన ఎన్ని రోజులు ఉంటుందో తాము చూస్తామన్నారు. జగన్ సర్కారులో అధికారులకు రూల్స్, రెగ్యూలేషన్స్ ఉండవని… బదిలీలకు భయపడి తమపై కేసులు పెడుతున్నారని విమర్శించారు. మరోవైపు అనవసరమైన విషయాల్లో తమ కుటుంబాన్ని ఇబ్బందులు పెడుతున్నారని మండిపడ్డారు. తన సోదరుల మీద ఎస్సీ, ఎస్టీ కేసులు కూడా పెట్టారని జేసీ దివాకర్ రెడ్డి తెలిపారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story