జైలులో ఉన్న ధూళిపాళ్లకు కరోనా..

by  |
జైలులో ఉన్న ధూళిపాళ్లకు కరోనా..
X

దిశ, వెబ్‌డెస్క్: సంగం డెయిరీలో అవకతవలు జరిగాయన్న ఆరోపణలతో అరెస్టైన టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్రకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఇదే కేసులో నరేంద్రతో పాటు రిమాండ్‌లో ఉన్న సంగం డెయిరీ ఎండీ గోపాలకృష్ణకు ఇటీవల కరోనా సోకగా ఆయనకు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అయితే నరేంద్ర జ్వరం, జలుబుతో బాధపడుతుండడంతో ఆయన పరిస్థితిపై ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు వారి న్యాయవాది ద్వారా కోర్టులో పిటిషన్ వేశారు. పిటిషన్‌ను స్వీకరించిన న్యాయస్థానం ధూళిపాళ్లను ప్రైవేటు ఆసుప్రతికి తరలించి చికిత్స చేయించాలని ఆదేశించింది. ఆసుపత్రిలో పరీక్షలు నిర్వహించగా నరేంద్రకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.

Next Story