చంద్రబాబు ఇంటిని ముంచడానికి ఆటలాడారు !

by  |
చంద్రబాబు ఇంటిని ముంచడానికి ఆటలాడారు !
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు ఇంటిని ముంచడం కోసం సీఎం జగన్‌ వరద నీటితో ఆటలాడారని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ విమర్శించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. వరద నీటి నిర్వహణపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఐఎండీ, సెంట్రల్ వాటర్ కమిషన్, కేంద్రం సూచనలను జగన్ సర్కార్ ఎందుకు పట్టించుకోవడంలేదని ప్రశ్నించారు. మానవ తప్పిందం వల్లే ఏపీలో వరద కష్టాలు వచ్చాయని, 7వ తేదీన ఐఎండీ హెచ్చరికలు జారీ చేస్తే అధికారులు 16వ తేదీన ప్రజల్లోకి రావడమేంటన్నారు. వరద నీటి నిర్వహణపై కమిటీని ఎందుకు నియమించలేదన్నారు.



Next Story