- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, వెబ్డెస్క్: పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ నేతలు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విమర్శించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల్లో భాగంగా వైసీపీ నేతలకు సీఎం జగన్ టార్గెట్లు పెట్టారని ఎద్దేవా చేశారు. దీంతో రాష్ట్రంలో ఏకగ్రీవాలకు ఒప్పుకోవాలని వైసీపీ నేతలు ఒత్తిడి తెచ్చారని ఆరోపించారు. ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులను బెదిరిస్తూ ఇష్టానుసారంగా ఏకగ్రీవాలు చేశారని చంద్రబాబు నాయుడు మండిపడ్డారు.
పంచాయతీ ఎన్నికల్లో భాగంగా వైసీపీ నేతలు కుప్పం నియోజకవర్గంలోనే కోట్ల రూపాయలు పంచారని చంద్రబాబు ఆరోపించారు. కుప్పంలో ప్రజాస్వామ్యం ఓడిపోయిందని తెలిపారు. వైసీపీ నేతలు డబ్బులు పంచుతున్నట్లు సాక్ష్యాధారాలతో పట్టించిన అధికారులు చర్యలు తీసుకోలేదని విమర్శించారు. ఎస్ఈసీ సైతం ఏమి చేయలేక పోయిందని అన్నారు. పోలీసులకు పోలింగ్ బూత్లలో ఏం పని ప్రశ్నించారు. రాష్ట్రమంతా పులివెందుల పంచాయతీ చేస్తారా అంటూ నిలదీశారు.