రూ.500 ఇచ్చి చేతులు దులుపుకున్నారు !

by  |
రూ.500 ఇచ్చి చేతులు దులుపుకున్నారు !
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో పెద్ద ఎత్తున వరదలు వస్తే సీఎం జగన్ ఒక్కసారి కూడా ఏరియల్ సర్వే చేయలేదని, లంక గ్రామాలు మునిగిపోతే రూ.500 ఇచ్చి చేతులు దులుపుకున్నారని టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు విమర్శించారు. చంద్రబాబు ఇంటిని ముంచాలనే వైసీపీ ప్రభుత్వం కుతంత్రాలు చేస్తుందని మండిపడ్డారు. దేవాలయాలపై దాడులు జరుగుతుంటే ప్రభుత్వం స్పందించడం లేదన్న అయ్యన్నపాత్రుడు.. విశాఖలో సమాజం ట్రస్ట్ భూములు సైతం కాజేస్తున్నారని ఆరోపించారు. ఏ విషయంపై కూడా సీఎం జగన్ ప్రెస్‌మీట్ పెట్టి ప్రజలకు క్లారిటీ ఇవ్వడం లేదని ఫైర్ అయ్యారు.


Next Story

Most Viewed