‘చంద్రబాబును చూసి వణికిపోతున్నారు’

by  |
TDP leader Atchannaidu
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ పోలీసులపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ మంత్రి అచ్చెన్నాయుడు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. చిత్తూరు జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు ధర్నాకు పోలీసులు అనుమతి నిరాకరించడంపై ఆయన మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడికి పర్యటించే హక్కు లేదా అని ప్రశ్నించారు. హౌస్ అరెస్టు చేసిన టీడీపీ నేతలను వెంటనే విడిచిపెట్టాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు పర్యటన చూసి మండుటెండలో కూడా వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు వణికిపోతున్నారన్నారు. టీడీపీ పాలనపై ప్రజలు విసిగెత్తారు కాబట్టే ప్రజల తరపున నిలబడుతున్న నేతలను ఇళ్లలో నిర్భందిస్తున్నారని అచ్చెన్నాయుడు ఎద్దేవా చేశారు.

Next Story

Most Viewed