పల్నాడు ఫ్యాక్షన్.. టీడీపీ లీడర్ అంకులు హత్య

by  |
పల్నాడు ఫ్యాక్షన్.. టీడీపీ లీడర్ అంకులు హత్య
X

దిశ, వెబ్‌డెస్క్: గుంటూరు జిల్లా పల్నాడులో ఫ్యాక్షన్ పడగ విప్పింది. ఆదివారం సాయంత్రం దాచేపల్లి మండలం పెదగార్లపాడు మాజీ సర్పంచ్, టీడీపీ నేత పురంశెట్టి అంకులును ప్రత్యర్థులు వేట కొడవళ్లతో నరికి చంపారు. దాచేపల్లి సితార రెస్టారెంట్ ​సమీపంలోని ఓ అపార్టుమెంట్లో దుండగులు ఈ దారుణానికి పాల్పడ్డారు. విషయం తెలుసుకున్న టీడీపీ శ్రేణులు గ్రామానికి చేరుకొని ఆందోళనకు దిగారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Next Story

Most Viewed