సీబీఐ విచారణ జరిపించాలి

by  |
సీబీఐ విచారణ జరిపించాలి
X

దిశ, విశాఖపట్నం: కర్నూలు జిల్లా నంద్యాలలో సలాం కుటుంబం ఆత్మహత్యపై సీబీఐ విచారణ జరిపించాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వం మొన్నటివరకు దళితులను.. ఇప్పుడు మైనార్టీలను వేధిస్తోందని విమర్శించారు. వైసీపీ నేతలు వేధించడం వల్లే సలాం కుటుంబ సభ్యులు ఆత్మహత్య చేసుకున్నారని ఆరోపించారు. సలాం కుటుంబానికి అండగా ప్రతి నియోజకవర్గంలో ఆందోళనకు పిలుపునిస్తున్నామని, అంబేద్కర్ విగ్రహాల దగ్గర నిరసన కార్యక్రమాలు చేపట్టాలన్నారు.

Next Story

Most Viewed