కుప్పంలో కలకలం.. టీడీపీ కౌన్సిలర్ అభ్యర్థి అదృశ్యం

by  |
కుప్పంలో కలకలం.. టీడీపీ కౌన్సిలర్ అభ్యర్థి అదృశ్యం
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు వేడి పుట్టిస్తున్నాయి. ఎన్నికలు జరగని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, పంచాయితీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. అధికార వైసీపీ, ప్రతిపక్ష వైసీపీ పోటాపోటీ విమర్శలతో స్థానిక సంస్థల ఎన్నికలు రంజుగా మారాయి. ప్రధానంగా చిత్తూరు, నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికలపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది.

ఈ క్రమంలో కుప్పంలో టీడీపీ కౌన్సిలర్ అభ్యర్థి ప్రకాష్ ఇవాళ అదృశ్యం కావడం స్థానికంగా కలకలం రేపుతోంది. కుప్పం 14వ వార్డు కౌన్సిలర్‌గా ప్రకాష్ నామినేషన్ వేశారు. ఎన్నికల క్రమంలో ఆయన అదృశ్యం కావడం దుమారం రేపుతోంది. దీనిపై ప్రకాష్ సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపడుతున్నారు.



Next Story

Most Viewed