వాళ్లలో ఎవరికీ రాజకీయ అనుభవం లేదు : చంద్రబాబు

by  |
chandrababu
X

దిశ, వెబ్‌డెస్క్: అధికార వైసీపీ నేతలపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం తిరుపతి టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మి తరపున రావూరులో చంద్రబాబు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… పనబాక లక్ష్మి 4 సార్లు పార్లమెంట్‌కు ఎన్నికయ్యారని, మిగతా అభ్యర్థుల్లో ఒకరికి కూడా రాజకీయ అనుభవం లేదని ఆయన అన్నారు. ప్రజలకు బంగారు భవిష్యత్‌ ఇవ్వాలని కష్టపడి పనిచేశానని, బడుగు బలహీన వర్గాల కోసం పనబాక పనిచేశారని గుర్తు చేశారు. బీసీలకు 33శాతం రిజర్వేషన్లు ఇచ్చిన ఘనత టీడీపీది. జగన్‌రెడ్డి హయాంలో బీసీల ప్రాధాన్యత ఇవ్వడం కష్టమే అని అన్నారు. నవరత్నాలు కాదు.. నవమోసాలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేగాకుండా.. వైసీపీ పాలనపై చర్చించడానికి ధైర్యం ఉందా? అని సవాల్ విసిరారు.


Next Story

Most Viewed