టాటా మోటార్స్ నుంచి సరికొత్త 'ఎక్స్‌ప్రెస్-టీ' బ్రాండ్ ఎలక్ట్రిక్ కారు విడుదల!

by  |
XPRES-T EV
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ దిగ్గజ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ బుధవారం తన మొదటి ఎలక్ట్రిక్ సెడాన్ ‘ఎక్స్‌ప్రెస్-టీ ఈవీ’ బ్రాండ్ మోడల్‌ను మార్కెట్లో విడుదల చేసింది. అద్దె వినియోగం కోసం ప్రత్యేకంగా తెచ్చిన ఈ మోడల్ రూ. 9.54 లక్షల ధరల వద్ద ప్రారంభమవుతుందని కంపెనీ తెలిపింది. ఈ సరికొత్త ఎలక్ట్రిక్ సెడాన్ ఎక్స్‌ప్రెస్-టీ 165, ఎక్స్‌ప్రెస్-టీ 213 వంటి రెండు ట్రిమ్‌లలో లభిస్తుందని కంపెనీ తెలిపింది. ఎక్స్‌ప్రెస్-టీ 165 165 కిలోమీటర్ల రేంజ్‌లో రూ. 9.54 లక్షల నుంచి రూ. 10.04 లక్షల మధ్య, ఎక్స్‌ప్రెస్-టీ 213 213 కిలోమీటర్ల రేంజ్‌లో రూ. 10.14 లక్షల నుంచి రూ. 10.64 లక్షల మధ్య లభిస్తుందని కంపెనీ వివరించింది. ‘మొబిలిటీ సేవలు, కార్పొరేట్, ప్రభుత్వం సంబంధిత అద్దె వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని ఎక్స్‌ప్రెస్-టీ ఈవీ మెరుగైన బ్యాటరీ పరిమాణం, ఫాస్ట్ ఛార్జింగ్ పరిష్కారాలతో తీసుకొచ్చాం. భద్రత, ప్రయాణీకుల సౌకర్యాలతో పాటు సరసమైన ధరలో ఇది లభిస్తుందని’ టాటా మోటార్స్ ఓ ప్రకటనలో తెలిపింది.


Next Story

Most Viewed