- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
లాక్డౌన్ కోసం టాస్క్ఫోర్స్ బృందాలు
by Shyam |
<p>దిశ, మహబూబ్నగర్: లాక్డౌన్ నిబంధనలను ఖచ్చితంగా అమలు చేసేందుకు టాస్క్ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేసినట్లు మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట్రావు ఓ ప్రకటనలో తెలిపారు. కరోనా వైరస్ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ఆరోగ్యం, సంక్షేమం దృష్ట్యా ఈ నెల 29 వరకు లాక్డౌన్ను పొడిగిస్తూ.. కొన్ని సడలింపులు చేసిందని ఆయన గుర్తు చేశారు. అయితే, జిల్లాలోని కొన్నిచోట్ల నిర్దేశించిన సమయం తర్వాత కూడా షాపులు తెరిచి ఉంచుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఇలాంటి ఉల్లంఘనలను అరికట్టడం కోసం […]</p>

X
దిశ, మహబూబ్నగర్: లాక్డౌన్ నిబంధనలను ఖచ్చితంగా అమలు చేసేందుకు టాస్క్ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేసినట్లు మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట్రావు ఓ ప్రకటనలో తెలిపారు. కరోనా వైరస్ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ఆరోగ్యం, సంక్షేమం దృష్ట్యా ఈ నెల 29 వరకు లాక్డౌన్ను పొడిగిస్తూ.. కొన్ని సడలింపులు చేసిందని ఆయన గుర్తు చేశారు. అయితే, జిల్లాలోని కొన్నిచోట్ల నిర్దేశించిన సమయం తర్వాత కూడా షాపులు తెరిచి ఉంచుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఇలాంటి ఉల్లంఘనలను అరికట్టడం కోసం జిల్లా స్థాయిలో 5 టాస్క్ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ వెంకట్రావు వివరణ ఇచ్చారు.
Next Story






