- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, నర్సంపేట : వరంగల్ జిల్లా నర్సంపేట డివిజన్లో గుట్టుగా సాగుతోన్న గుట్కా అక్రమ రవాణాను టాస్క్ ఫోర్స్ పోలీసులు ఛేదించారు. సరఫరా చేస్తున్న నలుగురిని అదుపులోకి తీసుకోగా, మరో ముగ్గురు పరారీలో ఉన్నారు. టాస్క్ ఫోర్స్ అడిషినల్ డీసీపీ వైభవ్ రఘునాధ్ గైక్వాడ్ తెలిపిన వివరాల ప్రకారం.. నర్సంపేట పట్టణంలోని సాయినగర్ కాలనీకి చెందిన పుల్లూరి జితేందర్ అనే వ్యక్తి ఇంట్లో గుట్కా నిల్వ ఉందన్న విశ్వసనీయ సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ పోలీసులు రైడ్ చేశారు. ఈ దాడిలో పెద్ద ఎత్తున నిషేధిత పొగాకు ఉత్పత్తులు లభ్యమైనట్లు తెలిపారు. వాటి విలువ రూ. 14లక్షల 17వేలు ఉన్నట్లు గుర్తించారు.
బీదర్ ప్రాంతం నుండి నర్సంపేటకి సరఫరా అవుతున్నట్లు, అహ్మద్ అనే వ్యక్తి బీదర్ నుండి ఇక్కడికి సరఫరా చేస్తూ ఎక్కువ రేటుకు విక్రయిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. గుట్కా సరఫరాతో సంబంధం ఉన్న, పాఖాల కొత్తగూడ మండలానికి చెందిన ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని వలుపదాస వెంకటనారాయణ, వలుపదాస సాంబశివుడు, శ్రీనివాస్లుగా గుర్తించారు. గుట్కా రవాణాతో సంబంధం ఉన్న మరో ముగ్గురు పరారీలో ఉన్నట్లు సమాచారం. నిందితులు గుట్కా సరఫరాకు ఉపయోగించిన ఒక కారు, రెండు టాటా ఎస్ వాహనాలు, ఒక సెల్ ఫోన్ను పోలీసులు సీజ్ చేశారు. వీరిని నర్సంపేట పోలీసులకు అప్పగించినట్లు టాస్క్ ఫోర్స్ అధికారులు తెలిపారు.