జీహెచ్ఎంసీ ఎన్నికలను స్ఫూర్తిగా తీసుకోవాలి: తరుణ్ చుగ్

by  |
జీహెచ్ఎంసీ ఎన్నికలను స్ఫూర్తిగా తీసుకోవాలి: తరుణ్ చుగ్
X

దిశ, వెబ్‌డెస్క్: టీఆర్ఎస్ పాలనలో తెలంగాణ అభివృద్ధి కుంటు పడిందని బీజేపీ తెలంగాణ రాష్ట్ర ఇన్‌చార్జీ తరుణ్ చుగ్ విమర్శించారు. రంగారెడ్డి జిల్లా కొత్తూరులో జరిగిన బీజేపీ కార్యకర్తల సమావేశంలో ఆయన డీకే అరుణతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కరోనా నిబంధనలను పాటిస్తూ ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. జీహెచ్ఎంసీ ఎన్నికలను స్ఫూర్తిగా తీసుకొని కార్యకర్తలు పనిచేయాలన్నారు. కేంద్రం అందిస్తున్న సహకారంతోనే రాష్ట్ర అభివృద్ధి జరుగుతోందని డీకే అరుణ చెప్పారు. హైదరాబాద్‌కు కూతవేటు దూరంలో ఉన్న కొత్తూరు అభివృద్ధికి నోచుకోలేదంటే.. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యమే కారమణని ఆమె దుయ్యబట్టారు.

Next Story