తమిళనాడులో తొలి కరోనా బాధితుడి డిశ్చార్చ్

by  |
తమిళనాడులో తొలి కరోనా బాధితుడి డిశ్చార్చ్
X

తమిళనాడు రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా కరోనా వైరస్‌తో చెన్నై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వ్యక్తిని బుధవారం వైద్యులు డిశ్చార్చ్ చేశారు. ఆ రాష్ట్రంలో తొలి కరోనా బాధితుడిగా ఇతడేనని హాస్పిటల్ డాక్టర్లు పేర్కొన్నారు. చికిత్స అనంతరం పరీక్షలు నిర్వహించగా రిపోర్టు నెగిటివ్ వచ్చిందన్నారు. దీంతో అతన్ని ఇంటికి పంపించి వేయగా మరో రెండు వారాలు హోమ్ ఐసోలేషన్ లో ఉండాలని వైద్యులు సూచించినట్టు తెలుస్తోంది.

tags ; tamil nadu, 1st corona case, discharge, chennai hospital, doctors declare



Next Story

Most Viewed