- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, వెబ్డెస్క్: మిల్కీ బ్యూటి తమన్నా గత ఆరు నెలలుగా ఇంటికే పరిమితమైంది. లాక్డౌన్ కారణంగా అమ్మానాన్నతో విలువైన సమయాన్ని గడిపినందుకు హ్యాపీగా ఫీల్ అయింది. అయితే, వారం రోజులుగా పేరెంట్స్కు కొంచెం కరోనా లక్షణాలు కనిపించడంతో ఇంట్లో అందరూ టెస్ట్ చేయించుకున్నట్లు తెలిపింది. పేరెంట్స్కు కరోనా పాజిటివ్ నిర్ధారణ కాగా, తనతో పాటు ఫ్యామిలీ మెంబెర్స్, స్టాఫ్ అందరికీ నెగెటివ్ వచ్చినట్లు వెల్లడించింది. అయితే, అధికారులు వారి పరిస్థితిని గమనించి జాగ్రత్తలు తీసుకున్నారని.. అందరం కూడా కరోనా మార్గదర్శకాలకు అనుగుణంగా నడుచుకుంటున్నామని చెప్పింది. కాగా, అమ్మానాన్న త్వరగా రికవరీ అయ్యేలా ప్రార్థించాలని కోరింది తమ్మూ.
తమన్నా పోస్ట్పై స్పందించిన సమంత, కాజల్.. త్వరగా రికవరీ అయ్యేందుకు ప్రేయర్ చేస్తామన్నారు. అంకుల్, ఆంటీని జాగ్రత్తగా చూసుకోవాలని కోరారు. అభిమానులు సైతం వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు.