తొలి బోనం సమర్పించిన తలసాని సతీమణి

by Vadlamudi Anukaran |

<p>దిశ, కంటోన్మెంట్: సికింద్రాబాద్ లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల వేడుకలు కనుల పండుగగా ప్రారంభమయ్యాయి. అమ్మవారికి తొలి బోనం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సతీమణి స్వర్ణ సమర్పించారు. కొవిడ్ నేపథ్యంలో ఆలయం బయటే పండితులకు ఈ బోనాన్ని అందజేశారు. కాగా మంత్రి శ్రీనివాస్ యాదవ్ నివాసం నుండే అమ్మ వారికి ప్రతి సంవత్సరం తొలి బోనం సమర్పించడం ఆనవాయితీ. బోనాల సందర్భంగా ప్రతి ఏటా వీవీఐపీల రాకపోకలు, భక్తుల రద్దీతో కిక్కిరిసి పోయే ఆలయ [&hellip;]</p>

తొలి బోనం సమర్పించిన తలసాని సతీమణి
X

దిశ, కంటోన్మెంట్: సికింద్రాబాద్ లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల వేడుకలు కనుల పండుగగా ప్రారంభమయ్యాయి. అమ్మవారికి తొలి బోనం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సతీమణి స్వర్ణ సమర్పించారు. కొవిడ్ నేపథ్యంలో ఆలయం బయటే పండితులకు ఈ బోనాన్ని అందజేశారు. కాగా మంత్రి శ్రీనివాస్ యాదవ్ నివాసం నుండే అమ్మ వారికి ప్రతి సంవత్సరం తొలి బోనం సమర్పించడం ఆనవాయితీ. బోనాల సందర్భంగా ప్రతి ఏటా వీవీఐపీల రాకపోకలు, భక్తుల రద్దీతో కిక్కిరిసి పోయే ఆలయ ప్రాంగణం కరోనా వల్ల బోసి పోతూ కనిపిస్తోంది.

Next Story