- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జానారెడ్డికి పట్టిన గతే ఈటలకు పడుతుంది: తలసాని సంచలన వ్యాఖ్యలు
by Ramesh Goud |
<p>దిశ, తెలంగాణ బ్యూరో: ఈటల రాజేందర్కు హుజురాబాద్ ప్రజలు ఉప ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పిలుపునిచ్చారు. గురువారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గెల్లు శ్రీనివాస్ యాదవ్ బానిస అనడం భావ్యం కాదని, ఇది ఈటల రాజేందర్ అహంకారానికి నిదర్శనం అని విమర్శించారు. ఈటల ముందు గెల్లు చిన్న పిల్లవాడు కావచ్చు కానీ.. ఆ నాడు ఈటల కూడా దామోదర్ రెడ్డి ముందు […]</p>

X
దిశ, తెలంగాణ బ్యూరో: ఈటల రాజేందర్కు హుజురాబాద్ ప్రజలు ఉప ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పిలుపునిచ్చారు. గురువారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గెల్లు శ్రీనివాస్ యాదవ్ బానిస అనడం భావ్యం కాదని, ఇది ఈటల రాజేందర్ అహంకారానికి నిదర్శనం అని విమర్శించారు. ఈటల ముందు గెల్లు చిన్న పిల్లవాడు కావచ్చు కానీ.. ఆ నాడు ఈటల కూడా దామోదర్ రెడ్డి ముందు చిన్నవాడే అన్నారు. ఈటల హుజురాబాద్లో బీసీ.. శామీర్పేటలో ఓసీ అంటున్నారని తలసాని ఎద్దేవా చేశారు. ఉద్యమకారులకు టీఆర్ఎస్ ప్రాధాన్యతనిస్తుందని.. గతంలో సుమన్, కిశోర్ లాంటి వాళ్లకు పార్టీ అవకాశం కల్పించిందని గుర్తు చేశారు. జానారెడ్డికి పట్టిన గతే ఈ ఉప ఎన్నికల్లో ఈటలకు పడుతుందని జోస్యం చెప్పారు.
Next Story






