హాస్టల్ నిర్వాహకులతో మంత్రి సమావేశం

by  |
హాస్టల్ నిర్వాహకులతో మంత్రి సమావేశం
X

దిశ, న్యూస్ బ్యూరో: అమీర్ పేట్, ఎస్ ఆర్ నగర్ లో ఉన్న హాస్టల్ నిర్వాహకులతో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గురువారం సమావేశం నిర్వహించారు. హాస్టల్స్ లో ఉన్న విద్యార్థులను ఖాళీ చేయిస్తున్నారని వార్తలు రావడంతో నిర్వాహకులతో వెంటనే సమావేశం ఏర్పాటు చేశారు. హాస్టల్స్ లో ఉంటున్న విద్యార్థులకు భోజన సదుపాయం ఏర్పాటు చేస్తామని, ఖాళీ చేయించొద్దని మంత్రి సమక్షంలో జీహెచ్ఎంసీ అధికారులు నిర్వాహకులను కోరారు. హాస్టల్ రెంట్లు, నిర్వాహణ ఖర్చులను మినహాయించేలా చూస్తే ఉండనిచ్చేందుకు ఎలాంటి అభ్యంతరం లేదని హాస్టల్ నిర్వాహకులు మంత్రిని కోరారు. ప్రభుత్వం నుంచి నిర్వాహకులు కూడా ఇబ్బంది పడకుండా చూస్తామని మంత్రి హామీనిచ్చారు.


Next Story

Most Viewed