కూతురి దర్శకత్వంలో తలైవా నెక్స్ట్ ప్రాజెక్ట్?

by  |
Rajinikanth,-Saundarya
X

దిశ, సినిమా: సూపర్‌స్టార్ రజినీకాంత్ సినిమా రిలీజ్ అవుతుందంటే ఫ్యాన్స్‌కు పండగే. తన చిత్రాలు వరుసగా నిరాశపరుస్తున్నా సరే.. ఆయన స్టైల్‌, మ్యానరిజానికి పడిపోయే అభిమానులు కొత్త చిత్రం‌కోసం ఎదురుచూస్తూనే ఉంటారు. ఈ క్రమంలో ‘అన్నాత్తె’ చిత్రంపై భారీ ఆశలు పెట్టుకున్న అభిమానులు ‘దీపావళి’కి సినిమా రిలీజ్‌ అవుతుందని వెయిట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుండగా.. తర్వాత సినిమా ఎవరి దర్శకత్వంలో ఉంటుందనే దానిపై డిస్కషన్ జరుగుతోంది. ఇప్పటికే యంగ్, సీనియర్ దర్శకులతో‌పాటు తన కుమార్తె సౌందర్య కూడా కథ వినిపించగా.. ఇందులో ఏది ఫైనల్ చేస్తారనే దానిపై చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో రజినీకాంత్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ కూతురి దర్శకత్వంలోనే చేస్తారని నిర్ణయించుకున్నట్లు టాక్. కాగా ప్రస్తుతం అమెరికాలో ఉన్న రజనీ చెన్నై చేరుకున్న తర్వాత దీనిపై అఫిషియల్ అనౌన్స్‌మెంట్ చేస్తారని సమాచారం.

Next Story

Most Viewed