డైరెక్టర్‌గా మారిన హీరో వైఫ్.. రియల్ లైఫ్‌ కథగా..

by  |
Tahira Kashyap
X

దిశ, సినిమా: బాలీవుడ్ హీరో ఆయుష్మాన్ ఖురానా వైఫ్ తహీరా కశ్యప్ ఫీచర్ ఫిల్మ్ డైరెక్టర్‌గా మారింది. ఇప్పటికే ప్రొడ్యూసర్‌, ఆథర్, షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్‌గా ప్రూవ్ చేసుకున్న ఆమె.. తొలిసారి మెయిన్ స్ట్రీమ్ ఫిల్మ్ డైరెక్ట్ చేయబోతున్నట్లు ప్రకటించింది. ‘షర్మాజీ కీ బేటీ’ పేరుతో వస్తున్న కామెడీ డ్రామా మోడ్రన్ ఇండియన్ ఫిమేల్ గురించి చెప్పబోతుండగా.. సాక్షి తన్వర్, దివ్యా దత్త, సియామీ ఖేర్ ప్రధాన పాత్రల్లో కనిపించబోతున్నారు. ఈ సందర్భంగా సోషల్ మీడియా పోస్ట్‌లో డైరెక్టర్‌గా మారబోతున్న క్షణాన్ని నమ్మలేకపోతున్నానని తెలిపింది. ఈ డ్రీమ్ ఫుల్‌ఫిల్ అయ్యేందుకు సహకరించిన ప్రతీ ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపింది. ఈ ఫిల్మ్ తన హార్ట్‌కు, జీవితానికి దగ్గరగా ఉంటుందన్న ఆమె.. తల్లి, జీవితభాగస్వామి సపోర్ట్‌కు థాంక్స్ చెప్పింది. కాగా ఈ చిత్రాన్ని అప్లాజ్ ఎంటర్‌టైన్మెంట్, ఎల్లిప్సిస్ ఎంటర్‌టైన్మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.



Next Story

Most Viewed