ఓటీటీ రూట్ తీసుకున్న రష్మి..

by  |
rashmi-racket
X

దిశ, సినిమా : బాలీవుడ్ బ్యూటీ తాప్సీ పన్ను నెక్స్ట్ ప్రాజెక్ట్ ఓటీటీలో రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన ‘హసీన్ దిల్‌రుబా’తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న భామ.. మరో సూపర్ హిట్ ఖాతాలో వేసుకునేందుకు రెడీ అవుతోంది. ఈ క్రమంలోనే తన స్పోర్ట్స్ డ్రామా ‘రష్మి రాకెట్’ జీ5లో రిలీజ్ కాబోతున్నట్లు ట్విట్టర్ వేదికగా ప్రకటించింది. ఆకర్ష్ ఖురానా దర్శకత్వంలో వస్తున్న మూవీని రోనీ స్క్రూవాలా, నేహా ఆనంద్, ప్రంజల్ ఖాంధియా సంయుక్తంగా నిర్మిస్తుండగా.. అక్టోబర్ 15 నుంచి ప్రీమియర్ కాబోతున్నట్లు అఫిషియల్‌గా అనౌన్స్ చేశారు మేకర్స్. ఈ చిత్రంలో రన్నర్‌గా కనిపించబోతున్న తాప్సీ.. అథ్లెట్ బాడీ గెయిన్ చేసేందుకు చాలా కష్టపడింది. పుణె, ముంబైలో షూటింగ్ జరగ్గా.. తాప్సీ మాసివ్ ఫిజకల్ ట్రాన్స్‌ఫర్మేషన్‌కు నెటిజన్లు నుంచి బెస్ట్ కాంప్లిమెంట్స్ అందాయి.

https://twitter.com/taapsee/status/1439839895405481984?s=20



Next Story

Most Viewed