- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, వెబ్డెస్క్: బాలీవుడ్ బ్యూటీ తాప్సీ పన్ను ప్రస్తుతం రెండు స్పోర్ట్స్ డ్రామా మూవీస్కు కమిట్ అయింది. ఒకటి ఇండియన్ క్రికెటర్ మిథాలీ రాజ్ జీవితకథ ఆధారంగా తెరకెక్కుతున్న ‘శభాష్ మిథు’ కాగా, మరొకటి గుజరాతీ అథ్లెట్ లైఫ్ స్టోరీ బేస్ చేసుకుని రూపుదిద్దుకుంటున్న ‘రష్మి రాకెట్’. అయితే ఈ రెండు సినిమాల షూటింగ్ ప్రారంభం కావాల్సి ఉండగా.. ఆ లోపు ఎంజాయ్ చేసేందుకు వెకేషన్కు వెళ్లింది.
ఇన్నాళ్లూ లాక్డౌన్లో ఉన్న తాప్సీ.. ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో కలిసి మాల్దీవ్స్ ట్రిప్కు వెళ్లింది. అభిమానులకు ఇందుకు సంబంధించిన అప్డేట్స్ కూడా ఇస్తోంది. ‘ఇంకొన్ని రోజులు ఇదే మా ఇల్లు’ అంటూ తను స్టే చేస్తున్న హోటల్ ఫొటోస్ కూడా షేర్ చేసిన తాప్సీ.. మాల్దీవ్స్ అందాలను ఆస్వాదిస్తున్నట్లు తెలిపింది. కానీ కేవలం ఎంజాయ్ చేసేందుకే అక్కడికి వెళ్లినా.. తను కమిట్ అయిన స్పోర్ట్స్ డ్రామా మూవీస్ కారణంగా ఫిట్గా ఉండేందుకు వర్కౌట్ మాత్రం చేయకతప్పడం లేదంటోంది. అమేజింగ్ వ్యూతో ఉన్న జిమ్లో ట్రేడ్ మిల్పై తను రన్నింగ్ చేస్తున్న పిక్ షేర్ చేయగా.. సినిమాల కోసం ఫిట్నెస్కు కట్టుబడి ఉండటం పట్ల ఫ్యాన్స్ తాప్సీకి కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. ఆల్మోస్ట్ మైకేల్ జాక్సన్ అంటూ స్పెషల్ పిక్చర్ పోస్ట్ చేసిన తాప్సీ.. ఎంజాయ్ చేయడంలో టైమ్ వేస్ట్ చేయదలుచుకోలేదని అంటోంది.