మరికొన్ని గంటల్లో దాయాదుల పోరు.. కీలక వ్యాఖ్యలు చేసిన విరాట్ కోహ్లీ

by  |
Virat Kohli
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తోన్న ఆ రోజు రానే వచ్చింది. టీ20 ప్రపంచ కప్‌లో భాగంగా దుబాయ్‌లోని దుబాయ్ ఇంటర్నేషనల్‌ స్టేడియంలో చిరకాల ప్రత్యర్థులైన భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య మహత్తర పోరు జరగనుంది. అయితే, మరికొన్ని గంటల్లో మ్యాచ్ ప్రారంభం కానున్న నేపథ్యంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కీలక వ్యాఖ్యలు చేశారు. కరోనా కారణంగా ఆటగాళ్లకు తప్పనిసరి చేసిన బయో బబుల్ నుంచి విముక్తి కల్పించాలని, దీని మూలంగా క్రీడాకారులు కాస్త రిలాక్స్ అవుతారని అన్నారు. ప్లేయర్ల ఆరోగ్యాన్ని పణంగాపెట్టి ఆడించడం వల్ల క్రికెట్‌కు ఎటువంటి ఉపయోగం ఉండదని విరాట్ స్పష్టం చేశారు. బయో బబుల్ నుంచి కాస్త బ్రేక్ ఇస్తే, సేదతీరుతారని, తిరిగి వచ్చినప్పుడు ఎటువంటి పరిస్థితుల్లో అయిన ఇబ్బంది లేకుండా అద్భుతంగా రాణిస్తారని అన్నారు.

Next Story

Most Viewed