- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, స్పోర్ట్స్: T20 ప్రపంచ కప్ లో భాగంగా దుబాయ్ వేదికగా జరిగిన రెండో సెమీఫైనల్ లో ఆసీస్ ఘనవిజయం సాధించింది. టాస్ గెలిచిన ఆసీస్ మొదట బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ ఓపెనర్ల ఫామ్ కొనసాగడంతో మంచి ఆరంభాన్నే ఇచ్చారు. పాక్ బ్యాటర్లు రిజ్వాన్ (67),బాబర్ అజాం (39),ఫఖర్ జమాన్ (55) తో మెరవడంతో నిర్ణిత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి పాక్ 176 పరుగులు చేసింది. ఆసీస్ బౌలర్లలో స్టార్క్ రెండు వికెట్లు పడగొట్టగా, జాంపా, కమ్మిన్స్ తలో వికెట్ తీశారు.
177 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్కు మొదటి ఓవర్లోనే కెప్టెన్ ఫించ్ ఔటవ్వడంతో గట్టి ఎదురుదెబ్బ తాకింది.తరువాత వచ్చిన మార్ష్, స్మిత్, మాక్స్వెల్ వెంటవెంటనే వెనుతిరగడంతో ఆసీస్ పీకల్లోతు కష్టాల్లో పడింది. మరో ఓపెనర్ డేవిడ్ వార్నర్ తనదైన దూకుడు బ్యాటింగ్ ప్రదర్శించాడు. కానీ అతనికి సహకరించే మరో బ్యాటర్ లేకపోవడంతో వార్నర్(49) కూడా ఔటయ్యాడు. తరువాత వచ్చిన స్టోనిస్(40), వెడ్ (41) మెరుపు ఇన్నింగ్స్లు ఆడటంతో ఇంకో ఓవర్ మిగిలివుండగానే ఆసీస్ ఘనవిజయం సాధించి ఫైనల్లోకి ప్రవేశించింది. ఇక ఆదివారం ఫైనల్లో కివీస్తో ఆసీస్ తలపడనుంది.