నేడు T20 వరర్డ్‌ కప్ ఫైనల్..

by  |
నేడు T20 వరర్డ్‌ కప్ ఫైనల్..
X

క్రికెట్ అభిమానులంతా ఎప్పడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మహిళల టీ20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ ఆదివారం మధ్యాహ్నం 12.00కు మెల్‌బోర్న్ వేదికగా ప్రారంభం కానుంది. కంగారుల గడ్డ మీద జరుగుతున్నఈ మ్యాచ్ గురించి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. వరుస విజయాలతో దూకుడు మీదున్నటీం ఇండియా ఎలాగైనా ఆస్ట్రేలియాను వారి సొంత దేశంలోనే ఓడించి కప్ కైవసం చేసుకోవాలని చూస్తోంది. అదే విధంగా వరుసగా ఐదోసారి కూడా విజేతగా నిలిచి తన అధిపత్యాన్నికొనసాగించాలని ఆస్ట్రేలియా భావిస్తోంది. ప్రస్తుతం టీఇండియా హిట్టర్ షెఫాలీ మీదే అభిమానుల ఆశలన్నీ ఉన్నాయి. ఆమె ఏదైనా జాదు చేస్తే కప్ మనదే అన్నఆశాభావంతో క్రికెట్ అభిమానులు ఉన్నారు. అయితే నేడు ఈ మ్యాచ్ చాలా రసవత్తరంగా ఉంటుందని పలువురు మాజీ ఆటగాళ్లు తమ అభిప్రాయాలను వ్యక్తంచేస్తున్నారు. ఈ సందర్భంగా దేశంలోని పలువురు ప్రముఖ క్రీడాకారులు, సినీ ప్రముఖులు భారత మహిళల జట్టుకు అల్ ది బెస్ట్ చెబుతూ ట్వీట్లు చేస్తున్నారు.

Next Story

Most Viewed