ప్రసారాలు రాకపోతే కలెక్టర్‌కు ఫిర్యాదు చేయండి

by  |
ప్రసారాలు రాకపోతే కలెక్టర్‌కు ఫిర్యాదు చేయండి
X

దిశ, వెబ్‌డెస్క్: టీ-శాట్ నెట్‌వర్క్ ఛానెళ్ల ద్వారా విద్యార్థులకు ఆన్ లైన్ క్లాసులు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో స్థానిక కేబుల్ ఆపరేటర్లు ప్రసారం చేయకపోతే కలెక్టర్‌కు ఫిర్యాదు చేయాలని విద్యార్థులకు సీఈవో శైలేశ్‌రెడ్డి సూచించారు. డీటీహెచ్‌ ద్వారా ఇప్పటికే ప్రసారాలు అందిస్తున్నామని.. త్వరలో మిగితా డీటీహెచ్‌ సంస్థలు ప్రసారాలు చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. మూడో తరగతి నుంచి ఇంటర్మీడియట్‌ విద్యార్ధుల వరకు వారికి కేటాయించిన సమయాల్లో సెప్టెంబరు 1వ తేదీ నుంచి ఆన్ లైన్ క్లాసులు ప్రారంభమవుతాయని శైలేశ్‌రెడ్డి తెలిపారు.

Next Story

Most Viewed