15నుంచి ‘సైబ్ హర్’ ప్రచార కార్యక్రమం

by  |
15నుంచి ‘సైబ్ హర్’ ప్రచార కార్యక్రమం
X

దిశ, క్రైమ్‌బ్యూరో: సోషల్ మీడియాలో సురక్షితంగా ఎలా ఉండాలనే విషయంపై మహిళా సేఫ్టీ విభాగం ఈ నెల 15 నుంచి ప్రచారం నిర్వహించనుున్నట్లు డీఐజీ సుమతి తెలిపారు. సైబర్ స్పేస్‌లో మహిళలు, పిల్లలు వేధింపులకు దూరంగా సురక్షితంగా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మరింత అవగాహన కల్పిస్తామన్నారు. ఈ నెల 15 నుంచి సైబ్ హర్ పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు ఆమె చెప్పారు. అందుకు ఆన్ లైన్‌లో సైబర్ సేఫ్ ఫర్ హర్, తెలంగాణ స్టేట్ పోలీస్, యూనిసెఫ్ ఇండియా తదితర సైట్‌లలో మమ్మల్ని ట్యాగ్ చేయాలని కోరారు. అంతే కాకుండా, మీ సందేహాలకు, ప్రశ్నలకు పరిష్కారాలు కూడా లభిస్తాయని తెలిపారు.


Next Story

Most Viewed