దీపికా అలా చేయలేదు : స్వర

by  |
దీపికా అలా చేయలేదు : స్వర
X

సుశాంత్ సింగ్ మరణానికి, దావూద్ ఇబ్రహీం గ్యాంగ్‌కు సంబంధం ఉందని ఆరోపించిన మాజీ ఆర్ఏడబ్ల్యూ ఆఫీసర్ ఎన్‌కే సూద్.. తన యుట్యూబ్ చానల్ వేదికగా మరో ఆరోపణతో ముందుకొచ్చాడు. జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీని సందర్శించేందుకు బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొనె రూ. 5 కోట్ల రూపాయలు తీసుకుందని ఆరోపించాడు. బాలీవుడ్‌తో పాకిస్థాన్‌కు సంబంధం ఉందని.. బ్రిటిష్ – పాకిస్థానీ బిజినెస్‌మన్ అనీల్ ముశ్రత్ దుబాయ్ నుంచి కాల్ చేస్తేనే దీపికా జేఎన్‌యూ క్యాంపస్‌కు వెళ్ళిందన్నాడు. ముస్రత్‌కు పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, పాకిస్థాన్ ఆర్మీతో క్లోజ్ రిలేషన్‌షిప్ ఉందని.. బాలీవుడ్‌తో రిలేషన్స్ ఎంజాయ్ చేస్తున్నాడని ఆరోపించాడు. ముస్రత్ యూకేలోనూ సీఏఏ వ్యతిరేక నిరసనలకు ఆర్థిక సాయం చేశాడని ఆరోపించాడు.

కాగా దీపికా ఐదు కోట్లు తీసుకుందన్న ఆరోపణలను హీరోయిన్ స్వర భాస్కర్ ఖండించింది. సూద్ ఆరోపణలు మూర్ఖత్వంతో కూడుకున్నాయని ట్వీట్ చేసిన స్వర.. బాలీవుడ్‌ను ఇలాంటి అసత్యపు ఆరోపణలతో కించపరచడం మంచిది కాదని చెప్పింది.



Next Story

Most Viewed