స్వామీజీ కిడ్నాప్ కలకలం

by  |
స్వామీజీ కిడ్నాప్ కలకలం
X

దిశ,వెబ్‌డెస్క్: కర్ణాటకలో స్వామీజీ కిడ్నాప్ కలకలం రేపుతోంది. బార్లీ జిల్లా కపిలాపూర్ గ్రామం నుంచి అమ్మాజీ అనే స్వామీజీని దుండుగులు కిడ్నాప్ చేశారు. విమానంలో షిరిడీ వెళ్దామని స్వామీజీని నమ్మించి ఓ కారులో హైదరాబాద్‌కు తీసుకొచ్చారు కిడ్నాపర్లు. ఆపై హైదరాబాద్ నుంచి శంషాబాద్ మీదుగా బెంగుళూరు తీసుకుని వెళ్లారు. ఓ గదిలో స్వామీజీని బంధించి రూ.20 కోట్లు, కిలో బంగారం డిమాండ్ చేశారు. చివరకు కిడ్నాపర్లకు రూ.5 కోట్లు ఇస్తానని స్వామీజీ ఒప్పుకున్నాడు. దీంతో స్వామీజీని తిరిగి హైదరాబాద్‌కు తీసుకొచ్చారు.

కాగా, హైదరాబాద్‌కు చేరుకోగానే స్వామీజీ గుండె నొప్పి వస్తుందంటూ ఆస్పత్రిలో చేరాడు. కిడ్నాపర్ల గురించి డాక్టర్ల ద్వారా పోలీసులకు సమాచారం అందించారు. దీంతో కిడ్నాపర్ల నుంచి స్థానికులు స్వామిజీకి విముక్తి కల్పించారు. కిడ్నాపర్లు భాస్కర్ రెడ్డి, సతీష్ లను లంగర్ హౌస్ పోలీసులకు అప్పగించారు. అయితే కిడ్నాపర్లపై కనీసం కేసు నమోదు చేయకుండా వదిలేశారని స్వామీజీ ఆరోపించారు.



Next Story

Most Viewed