క్వారంటైన్‌లో మహిళ అనుమానస్పద మృతి

by  |
క్వారంటైన్‌లో మహిళ అనుమానస్పద మృతి
X

దిశ, వెబ్‌‌డెస్క్: కరోనా సోకి హోం క్వారంటైన్‌లో ఉంటున్న ఓ మహిళ అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. ఈ ఘటన ఖమ్మం జిల్లా కొణిజెర్ల మండలం తనికెళ్ల గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన చల్లా నాగరాజు, రామలక్ష్మి దంపతులకు కరోనా లక్షణాలు కనిపించడంతో పరీక్షలు చేయించుకోగా పాజిటివ్‌గా తేలింది. అయితే ఆరోగ్య సమస్య అంత తీవ్రంగా లేకపోవడంతో హోం క్వారంటైన్‌లో ఉండాలని వైద్యులు సూచించారు. ఈ క్రమంలో హోం క్వారంటైన్‌లో ఉంటున్న రామలక్ష్మీ ఆదివారం అనుమానస్పది స్థితిలో ఇంట్లో ఉరి వేసుకుని మృతిచెందింది.

గమనించిన కూతురు వెంటనే పోలీసులకు సమాచారం అందించింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆధారాలను సేకరించి మృతదేహాన్ని ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఇంట్లో మంటలు చెలరేగినట్టుగా గోడలు మసి పట్టి ఉండటం, మృతురాలి మొహం కాలిన గాయాలతో నల్లగా మారడం, ఆమె ఒంటిపై వున్న బట్టలు కూడా మసిపట్టి ఉండటంతో ఈ మృతిపై అనుమానాలు కలుగుతున్నాయి. తన వల్లే కరోనా సోకిందంటూ భార్యపై కోపాన్ని పెంచుకున్న భర్త గొడవపడుతున్నాడని.. ఈ క్రమంలో అతడే ఆమెను హతమార్చినట్టు మృతురాలి కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.


Next Story

Most Viewed