- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, కుత్బుల్లాపూర్ : అనుమానాస్పద స్థితిలో బీటెక్ విద్యార్థి మృతి చెందిన సంఘటన పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మేడ్చల్ జిల్లా మైసమ్మగూడలోని మల్లారెడ్డి ఉమెన్స్ ఇంజనీరింగ్ కళాశాలలో చంద్రిక(21) బీటెక్ నాలుగో సంవత్సరం చదువుతోంది. స్థానికంగా గల కృప హాస్టల్లో ఉంటుంది. రోజు మాదిరిగానే రాత్రి అందరితో సహా భోజనం చేసింది. ఏమైందో ఏమో గాని మంగళవారం ఉదయం హాస్టల్ బిల్డింగ్ పక్కన గల ఖాళీ స్థలంలో మృతిచెందడం కలకలం సృష్టించింది.
విషయం తెలుసుకున్న పేట్ బషీరాబాద్ ఏసీపీ రామలింగరాజు, సీఐ రమేష్లు ఘటన స్థలానికి చేరుకొని క్లూస్ టీం సహాయంతో వివరాలు సేకరిస్తున్నారు. ఎవరైనా కావాలని హత్య చేసి ఇక్కడ పడేశారా..? మారేమైనా జరిగిందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
Next Story