కూతురు ఆ పనిచేసిందని.. సొంత తల్లిదండ్రులే ఆమెను

by  |
కూతురు ఆ పనిచేసిందని.. సొంత తల్లిదండ్రులే ఆమెను
X

దిశ, ఏపీ బ్యూరో: గుంటూరు జిల్లాలో యువతి మృతి కలకలం సృష్టిస్తోంది. యువతి ఆత్మహత్య చేసుకుందని తల్లిదండ్రులు చెప్తుంటే ప్రేమించిందన్న కోపంతో తల్లిదండ్రులే హత్య చేశారన్న మరో ప్రచారం స్థానికంగా కలకలం రేపుతుంది. వివరాల్లోకి వెళ్తే వట్టిచెరుకూరు మండలం ముట్లూరులో భవానీ(18) అనే యువతి మృతి చెందింది. అయితే తల్లిదండ్రులు గుట్టుచప్పుడు కాకుండా మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. దీంతో అనుమానం వచ్చిన గ్రామస్థులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.

ఇంటిని పరిశీలించిన పోలీసులు తల్లిదండ్రులు సత్యం, సుజాతలను ప్రశ్నించారు. అంత్యక్రియలు రహస్యంగా ఎందుకు చేయాల్సి వచ్చిందని ప్రశ్నించారు. అయితే పొంతన లేని సమాధానాలు చెప్పడంతో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. మరోవైపు భవానీ ఓ యువకుడిని ప్రేమిస్తుందని.. ఆ ప్రేమ విషయంలో తల్లిదండ్రులతో గొడవ జరిగినట్లు ప్రచారం జరుగుతుంది. ప్రేమ విషయంలో తల్లిదండ్రులు, భవానీల మధ్యగొడవ జరిగిందని.. ఆ ఘర్షణలో భవానీ మృతి చెందినట్లు ప్రచారం జరుగుతుంది. దీంతో పోలీసులు హత్యా? ఆత్మహత్యా అన్న కోణంలో విచారణ జరుపుతున్నారు.

Next Story