చండూరులో ఆ యువకుడు మృతి.. ఎలా..?

by  |
చండూరులో ఆ యువకుడు మృతి.. ఎలా..?
X

దిశ, మునుగోడు: యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన చండూరు మండల పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే చండూరు మండల పరిధిలోని చొప్పవారి గూడెం కూడా గ్రామానికి చెందిన చొప్పరి శంకర్(21) మండల కేంద్రంలో ఇడ్లీ బండి వ్యాపారం నిర్వహిస్తుంటాడు.

అయితే మంగళవారం సాయంత్రం శిర్ధేపల్లి గ్రామ శివారు ప్రాంతంలో అతను అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడి చేరుకుని పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతుడిది ఆత్మహత్యా.. లేక మరింకేదైననా..? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

Next Story

Most Viewed