కల్వర్టును ఢీకొట్టిన ఆటో.. ముగ్గురు మృతి

by  |
కల్వర్టును ఢీకొట్టిన ఆటో.. ముగ్గురు మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: కృష్ణా జిల్లాలో తీరని విషాదం నెలకొంది. కల్వర్టును ఆటో ఢీకొట్టిన ప్రమాదంలో ముగ్గురు స్పాట్‌లోనే ప్రాణాలు కోల్పోయారు.ఈ ఘటన జిల్లాలోని విప్పన్నపేట వద్ద సోమవారం వెలుగులోకి వచ్చింది.

మృతులు కృష్ణాజిల్లా ఈదరకు చెందిన చిన్నారి మీనాక్షి, దంపతులు చిన్నస్వామి, తిరుతమ్మగా గుర్తించారు. వీరు స్క్రాప్ సామన్లు కొనుగోలు చేసే వ్యక్తులుగా తెలుస్తోంది. సమాచారం అందుకున్ప పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.



Next Story

Most Viewed