సుశాంత్‌పై సంచలన ఆరోపణ

by  |
సుశాంత్‌పై సంచలన ఆరోపణ
X

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ హీరో సుశాంత్ మృతి కేసులో సీబీఐ దర్యాప్తు ముమ్మరం చేసింది. సుశాంత్ నివాసంలో సీబీఐ అధికారులు మరోసారి తనిఖీ చేసి ఆధారాలు సేకరించారు. సుశాంత్ స్నేహితుడిని సిద్ధార్థ్ పితానిని పిలిపించి జూన్ 14కి ముందు జరిగిన విషయాలపై ఆరా తీసింది. ఈ కేసుకు సంబంధించి రియా చక్రవర్తిని మరోసారి సీబీఐ ప్రశ్నించే అవకాశం ఉంది. సుశాంత్ పోస్ట్ మార్టం రిపోర్టును పరిశీలించనున్న సీబీఐ అధికారులు.

సుశాంత్ ఇంట్లో పనిచేస్తున్న నీరజ్ సింగ్ ముంబై పోలీసులకు సంచలన విషయం వెల్లడించినట్లు సమాచారం. సుశాంత్ తరుచు గంజాయి సిగరెట్లు తాగేవాడని.. ఆత్మహత్యకు రెండు రోజుల ముందు కూడా తాను గంజాయి నింపిన సిగరెట్లు సుశాంత్‌కు ఇచ్చినట్లు నీరజ్ విచారణ వెల్లడించినట్లు సమాచారం.


Next Story