సుశాంత్‌ది హత్యే.. ఫ్యామిలీ లేఖ

by  |
సుశాంత్‌ది హత్యే.. ఫ్యామిలీ లేఖ
X

బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం సంచలనం కలిగించిన విషయం తెలిసిందే. సుశాంత్ మరణించి దాదాపు రెండు నెలలు అవుతున్నా.. అతనిది హత్యా లేక ఆత్మహత్యా? అని తేల్చలేకపోయారు పోలీసులు. మొదటి నుంచి కూడా ఇది ముమ్మాటికీ హత్యే అని.. సీబీఐ విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు అభిమానులు, స్నేహితులు, కుటుంబీకులు. వారి డిమాండ్‌కు అనుగుణంగానే ప్రస్తుతం సీబీఐ విచారణ జరుగుతుండగా.. సుశాంత్‌ది మర్డర్ అంటూ తొమ్మిది పేజీల లేఖ రిలీజ్ చేశారు కుటుంబీకులు.

తమది అత్యంత దృఢమైన బంధాలు కలిగిన కుటుంబమని.. కెరియర్‌లో పైకి ఎదిగేందుకు పిల్లలు విలేజ్ నుంచి సిటీకి వెళ్లారని తెలిపారు. సుశాంత్‌కు తల్లి దూరమైనా ఆ ప్రేమలో ఎలాంటి లోటు లేకుండా పెంచామని లేఖలో వెల్లడించారు. తల్లి ఆశయాలకు అనుగుణంగా సుశాంత్ పెరిగాడని.. తన కలలను సాకారం చేసుకున్నాడని చెప్పారు. పదేళ్లు తన సామ్రాజ్యంలో ఆనందంగా ఉన్న సుశాంత్‌ను హత్య చేసి, దీన్ని ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని లేఖలో పేర్కొన్నారు.



Next Story

Most Viewed