- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు వ్యవహారం ఏపీ రాజకీయాల్లో దుమారం రేపుతోంది. విచారణ పేరుతో పోలీసులు తనపై దాడి చేశారని రఘురామకృష్ణం రాజు లిఖితపూర్వక ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ వ్యవహారం రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది.
కాగా ఆయనపై సీఐడీ కేసు పెట్టి అరెస్టు చేయడాన్ని సవాలు చేస్తూ సీనియర్ న్యాయవాది ఆదినారాయణరావు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. సీఐడీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ పై స్టే విధించాలని ఆయన పిటిషన్ లో కోరినట్లు తెలుస్తోంది. కాగా ఈ పిటిషన్ ను పరిశీలించిన సుప్రీంకోర్టు రఘురామకృష్ణం రాజుకు హైదరాబాద్ లోని ఆర్మీ హాస్పిటల్ లో వైద్య పరీక్షలు నిర్వహించాలని ఆదేశించినట్టు సమాచారం. పిటిషన్ పై అటార్నీ జనరల్ అభిప్రాయం తీసుకున్న తర్వాత తుది ఆదేశాలు వెలువడే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
Next Story