అత్తారింట్లో భార్యకు ఏమైనా భర్తదే బాధ్యత

by  |
supreme court
X

దిశ, వెబ్‌డెస్క్: మహిళలపై వేధింపులకు సంబంధించి తాజాగా సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. అత్తారింట్లో మహిళలపై వేధింపుల వ్యవహారంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అత్తారింట్లో మహిళను ఎవరు వేధించినా.. బాధ్యత కట్టుకున్న భర్తదే అని సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు వెల్లడించింది. వేధింపుల కేసులో భర్తకు ముందస్తు బెయిల్‌ ఇవ్వడాన్ని కూడా సుప్రీం నిరాకరించింది.

ఈ తీర్పుపై మహిళా సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఇటీవల అత్తారింట్లో మహిళలకు వేధింపులు బాగా ఎక్కువవుతున్నాయి. అదనపు కట్నం తీసుకురావాలని లేదా మరో కారణంతో అత్తారింట్లో మహిళలు వేధింపులకు గురవుతున్నారు. ఈ క్రమంలో సుప్రీం తీర్పు మహిళల్లో భరోసా నింపుతుందని మహిళా సంఘాలు చెబుతున్నాయి.

పంజాబ్‌కు చెందిన ఒక మహిళ భర్తపై వేధింపుల కోసం పెట్టింది. అదనపు కట్నం తీసుకురావాలని వేధిస్తున్నారని ఫిర్యాదు చేసింది. అయితే ఈ కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ భర్త మహాజన్ సుప్రీంను ఆశ్రయించాడు. ఈ కేసు విచారణ సందర్భంగా.. అత్తివారింట్లో భార్య ఎలాంటి వేధింపులు గురైనా బాధ్యత భార్యదే అతి తీర్పు ఇచ్చింది.



Next Story

Most Viewed