వెల్కమ్ బ్యాక్ టు ఏఎంబీ : మహేశ్

by  |
వెల్కమ్ బ్యాక్ టు ఏఎంబీ : మహేశ్
X

దిశ, వెబ్ డెస్క్: కరోనా మహమ్మారి కారణంగా తొమ్మిది నెలలు థియేటర్లు బంద్ అయిపోయాయి. కొవిడ్ అన్ లాక్‌లో భాగంగా 50 % ఆక్సుపెన్సీతో పలు రాష్ట్రాల్లో ప్రారంభమవుతున్నాయి. తెలంగాణలో శుక్రవారం నుంచి టాకీస్‌లు ప్రారంభమవుతున్నాయి. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయి భద్రత, కొవిడ్ ప్రొటోకాల్స్‌ను పాటిస్తూ మల్టీప్లెక్స్‌ను నిర్వహించబోతున్నట్లు ఏఎంబీ యాజమాన్యం ప్రకటించింది.

సూపర్ స్టార్ మహేశ్‌బాబు ఏఎమ్‌బీ గురించి ట్వీట్ చేశాడు. ‘ఏఎమ్‌బీ మళ్లీ ప్రారంభం కాబోతోంది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లోనూ ప్రేక్షకులందరికీ భద్రతతో కూడిన అందమైన అనుభవాన్ని అందించేందుకు ఏఎంబీ స్టాఫ్ అంతా ఎంతో కష్టపడ్డారు. జాగ్రత్తగా ఉండండి. మీ భద్రతే మా ప్రాధాన్యం. వెల్కమ్ బ్యాక్ టు ఏఎమ్‌బీ’ అని ట్వీట్ చేశాడు.


Next Story