కాజీపేట రైల్వే మహిళా ఉద్యోగులపై లైంగిక వేధింపులు..?

by  |
కాజీపేట రైల్వే మహిళా ఉద్యోగులపై లైంగిక వేధింపులు..?
X

దిశ, కాజీపేట: కాజీపేటలోని ఎస్ఏంటీ శాఖలో పని చేస్తున్న ఉన్నతాధికారి లైంగిక వేధింపుల‌కు పాల్పడుతున్నట్లుగా ఆరోపిస్తూ ఇద్దరు ఉద్యోగినులు జీఆర్పీ పోలీస్‌స్టేష‌న్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేర‌కు మంగళవారం కాజీపేట జీఆర్పీ ఎస్ఐ అశోక్ కుమార్‌కు ఫిర్యాదు అంద‌జేశారు. మాట వినని వారికి చార్జిషీటు జారీ చేస్తానంటూ భ‌యాందోళ‌న‌కు గురిచేస్తున్నట్లుగా ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆయ‌న తెలిపిన వివ‌రాల ప్రకారం.. ఎస్ఎస్‌టీ విభాగంలో పనిచేస్తున్న ఇద్దరు మహిళలు వేర్వేరుగా ఏడీఎస్టీఈ సంపత్ కుమార్‌పై ఫిర్యాదు చేశారని తెలిపారు. స్టేషన ఘన్‌పూర్ నుంచి ఇప్పగూడకు అలాట్మెంట్‌పై వెళ్లిన మ‌హిళా ఉద్యోగితో అసభ్యకరంగా మాట్లాడిన‌ట్టు ఫిర్యాదులో పేర్కొన్నట్టు తెలిపారు. వాట్సాప్‌లో అసభ్యకర మెసేజ్‌లు పెట్టడం, నీవు డ్యూటీకి ఏ డ్రెస్సులో వచ్చావని, సెల్ఫీ తీసి నాకు వాట్సాప్ చేయమనడం చేసేవాడని బాధితురాలు ఫిర్యాదు చేసిన‌ట్లు తెలిపారు. ఇదిలా ఉండ‌గా మరో ఉద్యోగినితో కూడా సంపత్ కుమార్ ఫోన్‌లో రాత్రిపూట అసభ్యకరమైన మేసెజ్‌లు వాట్సాప్‌లో పంపుతున్నాడని ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.

Next Story

Most Viewed